allari naresh: 'సుడిగాడు' సీక్వెల్ కి ముహూర్తం కుదిరింది

  • 'సుడిగాడు' సీక్వెల్ కి సన్నాహాలు 
  • ఈ నెల 12న సెట్స్ పైకి 
  • సంగీత దర్శకుడిగా శ్రీవసంత్  

అల్లరి నరేశ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'సుడిగాడు' ఒకటి. ఈ సినిమా భారీ వసూళ్లతో మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి భీమనేని శ్రీనివాసరావు రంగాన్ని సిద్ధం చేస్తున్నారనీ .. ఈ సినిమా చేయడానికి అల్లరి నరేశ్ రెడీ అవుతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాకి, శ్రీ వసంత్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే ఇతర నటీనటుల .. సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లరి నరేశ్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.    

More Telugu News