accident: డివైడర్‌ను ఢీకొట్టి ఇన్నోవాపై పడిన లారీ.. న‌లుగురు హైద‌రాబాదీయుల‌కు తీవ్ర‌ గాయాలు!

  • విశాఖ‌ప‌ట్నంలోని అరిలోవ సమీపంలోని సాయిబాబా గుడి వ‌ద్ద ప్ర‌మాదం
  • నుజ్జునుజ్జ‌యిన ఇన్నోవా
  • క్ష‌త‌గాత్రుల‌కు ఆసుప‌త్రిలో చికిత్స

వేగంగా వ‌చ్చిన ఓ లారీ ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టిన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని అరిలోవ సమీపంలోని సాయిబాబా గుడి వ‌ద్ద‌ చోటు చేసుకుంది. డివైడ‌ర్‌ను ఢీ కొన్ని ఆ కారు ఓ ఇన్నోవా వాహ‌నంపై ప‌డడంతో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల్లో న‌లుగురు హైద‌రాబాద్‌కు చెందిన వార‌ని తెలిసింది.

ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. లారీ వ‌చ్చి ప‌డిన వేగానికి ఇన్నోవా కారు నుజ్జునుజ్జయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. ఇన్నోవా వాహ‌నంలో వారు హైద‌రాబాద్ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింద‌ని తెలిపారు.         

  • Loading...

More Telugu News