Priyadarshini: 'ఏ లాటాఫ్ పీపుల్ రెడీ ఫర్ నేహ'... అంటూ గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన వలపు భామ ప్రియదర్శిని!

  • వరంగల్ లో తన అందాన్ని ఎరగా వేసిన ప్రియదర్శిని
  • ఐదు రోజుల్లోనే పెళ్లి చేసుకున్న ఓ యువకుడు
  • తనకోసం ఎంతో మంది ఉన్నారంటూ వెళ్లిపోయిన ప్రియదర్శిని

తాను చెన్నై నుంచి వచ్చిన డాక్టర్ నని, తన వద్ద 100 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చెబుతూ వరంగల్ లో ఓ ప్రముఖుడి కుమారుడిని ఐదు రోజుల్లోనే ప్రేమ పేరిట మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు, వ్యాపారులను అడ్డంగా ముంచేసిన ప్రియదర్శిని, అలియాస్ నేహ, చాకచక్యంగా చెక్కేసింది. ఆమె వెళ్లేముందు తాను బకాయిపడిన వారందరినీ, వరంగల్ లోని సుప్రభ హోటల్ కు పిలిచింది. డబ్బులిస్తానని చెప్పింది. వారు వచ్చేలోగానే పారిపోయింది.

ఇక ఆమె వెళ్లిపోయిందని తెలిసిన తరువాత ఓ యువకుడు ఆమెకు ఫోన్ చేసి, ఆ కాల్ సంభాషణను రికార్డు చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. తనకోసం ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని చెబుతూ తాను వెళుతున్నానని చెప్పింది. అందంగా నవ్వుతూనే హ్యాండిచ్చింది. జీకే కన్ స్ట్రక్షన్స్ కు చెందిన జయతో తాను వెళుతున్నానని, నువ్వు కాకుంటే ఎంతో మంది ఉన్నారని చెప్పింది. ఆ సంగతిని నువ్వు అర్థం చేసుకోలేవని అంది. కాగా, నేహ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు.

More Telugu News