క్రికెట్ దేవుడికి మరో ‘ డ్రీమ్ సెంచరీ’ చేయాలని ఉందట.. స్వయంగా వెల్లడించిన సచిన్!
- అన్ని స్కూళ్లలోనూ క్రీడలను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తానన్న సచిన్
- తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడల్లో ప్రాధాన్యమివ్వాలని సూచన
- ఉప రాష్ట్రపతి, క్రీడామంత్రిత్వశాఖలకు పుస్తకం అందజేత
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ క్రీడలను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ పనులు మొదలుపెట్టిందన్నాడు. ఇతర సబ్జెక్టులతోపాటు క్రీడలు కూడా ఉండాలనేది తన కల అని సచిన్ వివరించాడు. ఒకప్పటి తన ఫ్యాన్స్ ప్రస్తుతం తల్లిదండ్రులు అయి ఉంటారని, క్రీడాకారుల నుంచి వారు స్ఫూర్తి పొందితే తమ పిల్లలకు క్రీడల్లో ప్రాధాన్యం ఇస్తారని అన్నాడు. అదే కనుక జరిగితే అది మరో సెంచరీ చేయడమే అవుతుందని, అదే తన ‘డ్రీమ్ సెంచరీ’ అని సచిన్ వివరించాడు.