allu shirish: 'ఒక్క క్షణం' ఫీడ్ బ్యాక్ బాగుంది .. హ్యాపీగా వుంది: అల్లు శిరీష్

  • 'ఒక్క క్షణం' కథ వింటూనే థ్రిల్ ఫీలయ్యాను 
  • దర్శకుడిపై పెట్టుకున్న నమ్మకం నిజమైంది 
  • తదుపరి ప్రాజెక్టు గురించి వారం రోజుల్లో చెబుతాను  

అల్లు శిరీష్ .. సురభి .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఒక్క క్షణం' .. నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ గురించి తాజాగా అల్లు శిరీష్ స్పందించాడు. "ఈ సినిమా చూసిన వాళ్లందరూ నా నటన బాగుందంటూ మెచ్చుకుంటున్నారు. గతంలో కంటే బాగా చేశావని అభినందిస్తున్నారు"

"ముఖ్యంగా యాక్షన్ సీన్స్ బాగా చేశానని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా వుంది. గతంలో నేను చేసిన సినిమాలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది .. ఆనంద్ కథ చెబుతున్నప్పుడే నేను థ్రిల్ ఫీలయ్యాను. కంటెంట్ లోని కొత్తదనం వలన, వెంటనే ఓకే చెప్పేశాను. కథపై .. దర్శకుడిపై నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. తదుపరి సినిమా ఏమిటి? ఏ దర్శకుడితో ఉండనుంది? అనే విషయాలను ఓ వారం రోజుల్లో వెల్లడి చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News