padayathra: పాద‌యాత్ర చేయ‌నున్న ఏపీసీసీ నేత‌లు

  • ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు పాద‌యాత్ర‌
  • రేపు త‌మ నేత‌ల‌తో ర‌ఘువీరారెడ్డి స‌మావేశం
  • పాద‌యాత్ర‌పై ఏపీసీసీ నేత‌ల‌తో చ‌ర్చ

ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు ఏపీసీసీ నేత‌లు రెండు రోజులు పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ పాద‌యాత్ర వ‌చ్చేనెల 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో రేపు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి తమ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రేపు ఉద‌యం ర‌ఘువీరారెడ్డి బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి 10గంట‌ల‌కు రాజ‌మండ్రికి చేరుకుంటారు. అక్క‌డ త‌మ పార్టీ నేత‌ల‌తో స‌మావేశమై పాద‌యాత్ర‌పై ఏపీసీసీ నేత‌ల‌తో చ‌ర్చిస్తారని ఆ పార్టీ ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. ఈ స‌మావేశం అనంత‌రం ర‌ఘువీరారెడ్డి రాత్రి 7 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం వెళ‌తారు.   

More Telugu News