Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ రిలీజ్ దీపావళికే!

  • షూటింగ్ దశలో 'భరత్ అనే నేను' 
  • మహేశ్ 25వ మూవీ వంశీ పైడిపల్లితో 
  • ఎక్కువ భాగం షూటింగ్ న్యూయార్క్ లో        

మహేశ్ బాబు అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'భరత్ అనే నేను' కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆ తరువాత మహేశ్ బాబు .. తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో ఎక్కువగా జరగనుంది. అందువలన అక్కడి లొకేషన్స్ ను ఎంపిక చేశారు.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు చెబుతున్నారు. అశ్వనీదత్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను, దీపావళికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది మహేశ్ బాబు నుంచి రెండు సినిమాలు రానున్నాయన్న మాట.          

  • Loading...

More Telugu News