seerath kapoor: జోరు మీదున్న శీరత్ కపూర్.. వరుస ఆఫర్లు!

  • 'ఒక్క క్షణం'లో అలరించిన శీరత్ కపూర్ 
  • త్వరలో 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకుల ముందుకు 
  • రవికాంత్ పేరెపు .. శ్రీధర్ సీపానకు గ్రీన్ సిగ్నల్

తెలుగు తెరపై కథానాయికలుగా రకుల్ .. రాశి ఖన్నా .. కీర్తి సురేశ్ .. నివేదా థామస్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. అనుపమ పరమేశ్వరన్ .. వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో 'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శీరత్ కపూర్, తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత అమ్మాయి కాస్త సైలెంట్ గా కనిపించినా, ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది.

 'రాజుగారి గది 2' .. 'ఒక్క క్షణం' సినిమాలతో యూత్ ను మరింతగా ఆకట్టుకున్న ఈ సుందరి, త్వరలో 'టచ్ చేసి చూడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాత సినిమాను రవికాంత్ పేరెపు దర్శకత్వంలో చేయనున్న శీరత్ కపూర్, తాజాగా మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. కథ .. మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీధర్ సీపాన, ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కోసం ఆయన శీరత్ కపూర్ ను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.            

  • Loading...

More Telugu News