allu shirish: చిరంజీవిగారు చెప్పిన మాట ఎప్పటికీ మరచిపోను: అల్లు శిరీష్

  • సెల్ఫీ అడిగారంటే అదృష్టమే అనుకోవాలి 
  • నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను
  • చిరూ మాటలే మార్చేశాయి 

వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ అల్లు శిరీష్ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'ఒక్క క్షణం' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ మాట్లాడాడు. "మీరు కోపంగానో .. బాధగానో వున్నప్పుడు ఎవరైనా 'సార్ సెల్ఫీ' అంటే మీకు చిరాగ్గానే ఉంటుందా?" అనే ప్రశ్న అల్లు శిరీష్ కి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. "ఒకసారి చిరంజీవి గారు నాకు ఒక మంచి మాట చెప్పారు. 'నువ్ హీరో అయ్యాక రోజూ చాలామంది కలుస్తుంటారు. ఆ తరువాత వాళ్లెవరూ నీకు గుర్తుండరు కూడా. కానీ అవతల వ్యక్తికి నిన్ను మళ్లీ కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువలన నువ్ వేరే మూడ్ లో ఉన్నప్పటికీ ఆ అభిమాని కోసం అవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయ్. శిరీష్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడనేది తీపి జ్ఞాపకంగా ఆ అభిమానికి గుర్తుండిపోతుంది' అన్నారు. ఆయన మాటలు నన్ను ఆలోచింపజేశాయి .. మార్చేశాయి. ఎవరైనా సెల్ఫీ అడిగారంటే అదృష్టమేనని అనుకోవాలి .. అందుకే నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.        

More Telugu News