sharath kumar: నేను స్టేజ్ పై చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు!: శరత్ కుమార్

  • లారెన్స్ అడిగినప్పుడు ఒకే మాట చెప్పాను 
  • అలా జరగదని బలంగా చెప్పాడు 
  • వెంటనే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను  

లారెన్స్ దర్శకత్వం వహించిన 'కాంచన' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శరత్ కుమార్ 'హిజ్రా' పాత్రను పోషించారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ పాత్రను గురించి ప్రస్తావించారు. " ఇలాంటి పాత్రను చేస్తే ఆ తరువాత చేసే పాత్రలను   ఆడియన్స్ అంగీకరించరనే ఆలోచన చేయలేదు. ఓ పాత్ర నాకు నచ్చితే చేయడానికి వెంటనే ఓకే చెబుతాను. 'హిజ్రా'ల విషయంలో సమాజం ఇలా ఉండకూడదనే మెసేజ్ వున్న సినిమా ఇది" అన్నారు.

 'లారెన్స్ నాకు ఈ కథ చెప్పినప్పుడు .. నేను ఒకటే మాట అన్నాను. 'ఫస్టు సీన్ లో నన్ను చూసి గనుక జనాలు నవ్వేస్తే ఈ సినిమా ప్లాప్ అవుతుంది' అని చెప్పాను. 'అలా ఎప్పటికీ జరగదు సార్ .. మీలాంటి హీరో చెబితేనే ఈ మెసేజ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది .. మీరే చేయాలి' అని లారెన్స్ అన్నాడు. 'అప్పుడు ఆ పాత్ర చేయాలని నేను నిర్ణయించుకున్నాను'. ఆ సినిమాలో నేను స్టేజ్ పై వుండి చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది .. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది' అని చెప్పుకొచ్చారు.    

More Telugu News