Car: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

  • నవాబ్‌పేట మండలం జంగమాయిపల్లిలో ఘటన
  • ప్రమాదంపై పోలీసుల అనుమానాలు
  • హత్య కోణంలో దర్యాప్తు

మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం నెలకొంది. కారు దగ్ధమై వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నవాబ్‌పేట మండలం జంగమాయిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఎస్08ఈయూ 1120 కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేక అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కారు బూడిదైంది.

ఈ ఘటనపై  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్యా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రమాదం ఎలా  జరిగింది? అన్న వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

More Telugu News