Chandrababu: రెండు లక్షల మందికి రుణాలు అందజేస్తాం: మంత్రి సోమిరెడ్డి

  • వచ్చే నెల 11న రుణమేళా కార్యక్రమం
  • రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు అందజేస్తాం
  • విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి

వచ్చే నెలలో రెండు లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్టు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 11వ తేదీన రుణ మేళా నిర్వహించనున్నామని, రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు అందజేయనున్నట్టు తెలిపారు. స్వయం ఉపాధి నిమిత్తం 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ రుణాలను అందించనున్నట్టు చెప్పారు.

కౌలుదారులు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే రుణాల మంజూరుకు మూడు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అందించే రుణాలు అందక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రుణమేళా కార్యక్రమం నిర్వహించాలని బ్యాంకర్లను చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.

More Telugu News