Police: హైదరాబాద్‌లో రంగంలోకి 100 పోలీస్ టీమ్ లు.. 31న రాత్రంతా తనిఖీలు!

  • మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే కేసులు నమోదు
  • వాహనాన్ని కూడా సీజ్ చేస్తాం
  • రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • హెచ్చరించిన డీసీపీ ఏవీ రంగనాథ్

హైద‌రాబాద్ న‌గ‌రం నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నెల 31 (ఆదివారం) అర్ధరాత్రి రోజున నగరంలోని రోడ్లపై యువత చేసే హంగామాయే వేరు. ఈ నేపథ్యంలో రోడ్లను జీరో యాక్సిండెంట్‌ నైట్‌గా చేయాలని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు వ్యూహాన్ని సిద్ధం చేసుకుని పలు విషయాలు తెలిపారు. ఆ రోజు రాత్రంతా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రోజు డీసీపీ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు రోడ్లపై రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు తనిఖీలు ఉంటాయని, కానీ ఈ ఆదివారం రోజు మాత్రం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

సాధారణ రోజుల్లో ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో చేసే సోదాల్లాగే ఈ ఆదివారం కూడా తనిఖీలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ లో తనిఖీల కోసం మొత్తం 100 టీమ్ లను విధుల్లో ఉంచుతున్నట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే వారి వాహనాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News