sunil: అప్పట్లో నేను ఎత్తుకున్న చిన్నారి పాపే ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్: సునీల్

  • ఈ నెల 29న '2 కంట్రీస్' 
  • కథానాయికగా మనీషా రాజ్ 
  • ఆమె ఎంపిక అలా జరిగింది    

సునీల్ హీరోగా చేసిన 'టూ కంట్రీస్' సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సునీల్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక సరదా సంఘటనను గురించి చెప్పాడు. "ఈ సినిమా కోసం లొకేషన్లు చూడటానికి దర్శకుడు .. సినిమాటో గ్రాఫర్ యూఎస్ వెళ్లారు. అక్కడ మనీషా రాజ్ ఇంట్లో అతిథులుగా దిగారు. ఈ సినిమాలో కథానాయికకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఆమెకి ఉండటంతో, ఆమె పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు"

"మొదటి రోజు షూటింగ్ పూర్తయిన తరువాత "చాలా కాలం క్రితం మీరు మా పాపను ఎత్తుకున్నారు .. అప్పుడు మీతో మేం ఫోటో దిగాము" అని హీరోయిన్ తండ్రి అనడంతో ఆశ్చర్యపోయాను. 'సొంతం' సినిమా కోసం అప్పట్లో నేను ఫారిన్ వెళ్లాను. అప్పుడు ఓ యంగ్ కపుల్ తమ పాపను తీసుకొచ్చి నాతో ఫోటో దిగారు. ఆ అమ్మాయే ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అని తెలుసుకుని షాక్ అయ్యాను' అంటూ సునీల్ నవ్వాడు.

More Telugu News