deepa jayakumar: జయ మేనకోడలు దీప కార్యాలయంపై రాళ్లదాడి

  • టీ నగరల్ లోని కార్యాలయంపై దాడి
  • కిటికీ అద్దాలు ధ్వంసం
  • మాంబళం పోలీసులకు ఫిర్యాదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలిలత మేన కోడలు దీప జయకుమార్ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా వచ్చి, రాళ్లు విసిరారని చెప్పారు. ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఎంజీఆర్ అమ్మ దీప పెరవాయ్ పేరుతో దీప ఓ వేదికను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యాలయం చెన్నైలోని టీ నగర్ లో ఉంది. మరోవైపు ఈ దాడిపై ఆమె మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

  • Loading...

More Telugu News