anupama parameshwaran: ఇద్దరు క్రేజీ వ్యక్తులను కలిసినప్పుడు ఈ సెల్ఫీ తీసుకున్నా: అనుపమా పరమేశ్వరన్

  • నాని, మెహ్రీన్ లతో సెల్ఫీ
  • తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అనుపమ
  • అలరిస్తోన్న ఫొటో

'అ..ఆ..' సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించి పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా నేచురల్ స్టార్ నాని, నటి మెహ్రీన్ పిర్జాదాతో సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఇద్దరు క్రేజీ వ్యక్తులను కలిసినప్పుడు తీసుకున్న సెల్ఫీ' అని పేర్కొంది.

తనకు అటూ, ఇటూ నాని, మెహ్రీన్ పిర్జాదాలు ఉన్న ఆమె ఫొటో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువ నటులు మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.      

More Telugu News