subrahmania swamy: ఆర్కేన‌గ‌ర్ ఎన్నిక‌ల్లో నేను చెప్పిన‌ట్లే జ‌రిగింది: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి

  • భారీ మెజారిటీతో గెలిచిన‌ దిన‌క‌ర‌న్
  • నాకు ముందు నుంచే దిన‌క‌ర‌న్‌పై సానుభూతి ఉండేది
  • అప్ప‌ట్లో జ‌య‌ల‌లిత నామ మాత్రమే.. శశిక‌ళే అన్నీ చూసుకునేవారు!  

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఎన్నిక‌లో దినకరన్‌ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఇటీవ‌ల చెప్పిన విష‌యం తెలిసిందే. భారీ మెజారిటీతో దిన‌క‌ర‌న్ గెలిచిన నేప‌థ్యంలో సుబ్రహ్మ‌ణ్య స్వామి మ‌రోసారి స్పందించారు. టీటీవీ దినకరన్ గెలుస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. తనకు ముందు నుంచే ఆయ‌న‌పై సానుభూతి ఉండేదని చెప్పారు.

అంతేకాదు, తమిళనాడు దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. పాల‌నా వ్య‌వ‌హారాల‌న్నీ శశికళే చూసుకునేవారని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని వ్యాఖ్యానించారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని చెప్పుకొచ్చారు.          

  • Loading...

More Telugu News