Narendra Modi: క్రిస్‌మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ!

  • ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్‌ను ప్రారంభించిన మోదీ
  • మెట్రోరైలులో మోదీ, యోగి ప్ర‌యాణం
  • ప్ర‌పంచ‌మంతా ఈ రోజు క్రిస్‌మ‌స్ వేడుక‌లు జ‌రుపుకుంటోంది-ప్ర‌ధాని

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్‌ను ప్రారంభించారు. నోయిడాలోని బొటానిక‌ల్ గార్డెన్ నుంచి ఢిల్లీ క‌ల్కాజీ మందిర్ వ‌ర‌కు మెట్రో ప‌రుగులు తీయ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ మెట్రో రైలులో ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ప్ర‌పంచ‌మంతా ఈ రోజు క్రిస్‌మ‌స్ వేడుక‌లు జ‌రుపుకుంటోంద‌ని అన్నారు.

ప్ర‌జ‌లంద‌రికీ క్రిస్‌మ‌స్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు మోదీ పేర్కొన్నారు. అలాగే ఈ రోజు ఇద్ద‌రు భార‌త‌ర‌త్నల పుట్టిన‌రోజు అని మోదీ అన్నారు. మ‌దన్‌మోహ‌న్ మాల‌వ్య‌, వాజ్‌పేయీ జ‌న్మ‌దినం అని అన్నారు. కాగా, దేశంలో స్థిర ప్ర‌భుత్వం ఏర్పాటుకు యూపీ ప్ర‌జ‌లు కీల‌కపాత్ర పోషించార‌ని కొనియాడారు.

  • Loading...

More Telugu News