jio: 160 మిలియ‌న్ల‌కు చేరుకున్న రిల‌య‌న్స్ జియో వినియోగ‌దారులు

  • షారుక్‌కి తెలిపిన ఆకాశ్ అంబానీ
  • 40 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా అంబానీల వేడుక‌
  • వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన షారుక్‌ఖాన్‌

రిల‌య‌న్స్ జియో వినియోగ‌దారుల సంఖ్య 160 మిలియ‌న్ల‌కు చేరుకుంద‌ని ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ తెలిపారు. రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ పెట్టి 40 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా అంబానీలు ఓ వేడుక ఏర్పాటు చేశారు. ఆ వేడుక‌కు షారుక్‌ఖాన్ కొద్దిసేపు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అందులో భాగంగా ముకేశ్ అంబానీ పిల్ల‌లు ఇషా, ఆకాశ్‌ల‌తో షారుక్ ముచ్చ‌టించారు.

అందులో భాగంగా జియో వినియోగ‌దారులు 100 మిలియ‌న్ల‌కు చేరుకున్నార‌ని షారుక్ అన్నారు. కానీ దాన్ని స‌రిచేస్తూ 160 మిలియ‌న్లు అని ఆకాశ్ అంబానీ, షారుక్‌కి చెప్పాడు. 2106, సెప్టెంబ‌ర్‌లో మార్కెట్‌లోకి వ‌చ్చిన జియో ఆరు నెల‌ల పాటు ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో వినియోగ‌దారులు విప‌రీతంగా పెరిగిపోయారు.

More Telugu News