sadananda gowda: స్వచ్ఛ మంగళూరు కార్యక్రమంలో చీపురు పట్టిన మహిళ... నెటిజన్ల ఫైర్!

  • ఏడాది కొడుకును ఎత్తుకుని కార్యక్రమంలో పాల్గొన్న మహిళ
  • అభినందించిన కేంద్ర మంత్రి సదానందగౌడ
  • బిడ్డ ఆరోగ్యం పట్టించుకోలేదంటూ నెటిజెన్ల ఫైర్

కర్ణాటకలోని మంగళూరులో రామకృష్ణ మిషన్ 'స్వచ్ఛ మంగళూరు' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి సదానందగౌడ ఓ మహిళ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆమె పేరు కిరణ్ సువర్ణ అని... ఏడాది కొడుకును ఎత్తుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. మిస్ ఇండియాకన్నా ఆమె ఎక్కువేనని అన్నారు.

మరోవైపు సదానంద గౌడ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. పసి బిడ్డను ఎత్తుకుని ఈ పనేంటని ప్రశ్నించారు. బిడ్డ ఆరోగ్యానికి ఇది క్షేమకరం కాదని... ఈ విషయాన్ని తల్లి గుర్తించలేదని విమర్శించారు. ఆ తల్లికి పిల్లల సంరక్షణ తెలియదని మండిపడ్డారు. పిల్లవాడికి కనీసం మాస్క్ అయినా వేసి ఉండాల్సిందని అన్నారు. దేశంలోని మంత్రులకు పబ్లిసిటీ స్టంట్ ఎక్కువయిందని ధ్వజమెత్తారు.

More Telugu News