Balakrishna: బాలయ్యపై ప్రశంసలు కురిపించిన మండలి, అంబికా!

  • తెలుగు సంస్కృతికి ప్రతీక నందమూరి బాలకృష్ణ
  • సినీరంగంలో అద్భుతమైన వ్యక్తిగా వారు నిలుస్తారు: మండలి
  • గ్రాంధిక భాషను అవలీలగా మాట్లాడే బాలకృష్ణ
  • ఆ కొండవీటి సింహానికి ఈ జై సింహా కాకపోతే ఇంకెవరు పుడతారు: ఆడియో వేడుకలో అంబికా

తెలుగు పౌరుషానికి ప్రతీక ఎన్టీఆర్ అయితే, తెలుగు సంస్కృతికి ప్రతీక నందమూరి బాలకృష్ణ అని ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. ‘జై సింహా’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణ అపూర్వమైన వ్యక్తిత్వం గలవారని, తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారని అన్నారు. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి నడుం కడుతున్న గొప్ప వ్యక్తి అని, ఒక ఎమ్మెల్యేగానే కాకుండా, సినీరంగంలో అద్భుతమైన వ్యక్తిగా వారు నిలుస్తారని అన్నారు.

 అనంతరం, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ, ఆ కొండవీటి సింహానికి ఈ జై సింహా కాకపోతే ఇంకెవరు పుడతారండి? అని అన్నారు. నాడు ఎన్టీఆర్ తెలుగు జాతిని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడని అన్నారు. గ్రాంధిక భాషను అవలీలగా మాట్లాడగల ఏకైక సినీ నటుడు బాలకృష్ణ అని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని అంబికా కృష్ణ అన్నారు.  

  • Loading...

More Telugu News