jai simha: ‘జై సింహా’ వేడుక ప్రాంగణానికి చేరుకున్న బాలకృష్ణ.. అభిమానుల సందడి!

  • బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • బాలయ్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు
  • వేడుకను తిలకించేందుకు హాజరైన ఏపీ మంత్రులు

విజయవాడలోని ‘జై సింహా’ ఆడియో వేడుక ప్రాంగణానికి ప్రముఖ నటుడు బాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. బాలకృష్ణతో పాటు ప్రముఖ సినీనటుడు మురళీమోహన్, చలపతిరావు, ప్రముఖ నిర్మాత అంబికాకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు ఏపీ మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు కూడా హాజరయ్యారు. స్థానిక వజ్రా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆడియో రిలీజ్ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

 

  • Loading...

More Telugu News