jai simha: ‘జై సింహా’ ఆడియో వేడుక ప్రారంభం

  • విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో ప్రారంభమైన వేడుక
  • అభిమానులతో కిక్కిరిసిన వేదిక
  • వచ్చే నెల 12న విడుదల కానున్న ‘జై సింహా’

ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ ఆడియో విడుదల వేడుక కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది. స్థానిక వజ్రా గ్రౌండ్స్ లో ప్రారంభమైన ఈ వేడుకను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, బాలయ్య అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా, ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జై సింహా’లో నయనతార, నటాషా దోషి, హరిప్రియ తదితరులు నటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News