TTv Dinakaran: అన్నా డీఎంకే, శశికళ వర్గీయుల ఘర్షణ... ఆర్కే నగర్ కౌంటింగ్ కేంద్రంలో దాడి వీడియో!

  • మీడియాలో చక్కర్లు కొడుతున్న దాడి దృశ్యాలు
  • మధుసూదనన్ పై మరింత ఆధిక్యాన్ని సాధించిన టీటీవీ
  • మధ్యాహ్నం అమ్మ సమాధి వద్ద నివాళులు

తమిళనాడు ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతుండగా, దినకరన్ ఆధిక్యంలో ఉన్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు దాడికి దిగిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నాడీఎంకే ఏజంట్లు, దినకరన్ ఏజంట్లూ గొడవపడి కౌంటింగ్ అధికారులపై దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

కాగా, టీటీవీ దినకరన్ తన సమీప ప్రత్యర్థి మధుసూదనన్ పై మరింత ఆధిక్యాన్ని సాధించారు. ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. దినకరన్ ప్రస్తుతం చెన్నైలో లేరని, ఆయన మధ్యాహ్నం తరువాత నగరానికి వచ్చి తొలుత మెరీనా బీచ్ లోని అమ్మ సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారని ఆయన వర్గం నేతలు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం లోపల దాడి దృశ్యాల వీడియోను 'న్యూస్ 18' తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News