love: ప్రేమ వ్య‌వ‌హారం... పులివెందులలో యువ‌కుడిని వెంటాడి గొంతుకోసి హ‌త్య చేసిన దుండ‌గులు!

  • క‌డ‌ప జిల్లా పులివెందులలో ఘ‌ట‌న‌
  • బైకుపై వెళుతోన్న ర‌ఫీని అడ్డ‌గించిన దుండ‌గులు
  • క‌త్తుల‌తో దాడి
  • ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల ద‌ర్యాప్తు ప్రారంభం

క‌డ‌ప జిల్లా పులివెందులలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఎనిమిది మంది దుండ‌గులు వెంటాడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, స్థానిక జెండా మాను వీధిలో నివ‌సించే షేక్ మొహమ్మద్ రఫీ అనే యువకుడు బైకుపై వెళుతున్నాడు. వీధిలో అంద‌రూ చూస్తుండ‌గానే దుండ‌గులు ర‌ఫీని అడ్డ‌గించి క‌త్తితో గొంతు కోసి ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు ప్రేమ వ్యవహారమే కార‌ణ‌మై ఉంటుంద‌ని, అమ్మాయి తరపు బంధువులే ఈ హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. 

More Telugu News