chaitu: 'సవ్యసాచి'లోను కీలకపాత్రలో భూమిక!

  • చైతూ హీరోగా 'సవ్యసాచి'
  • హైదరాబాద్ లో షూటింగ్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్    

చందూ మొండేటి .. నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఈ కాంబినేషన్లో 'సవ్యసాచి' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 చైతూ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అని ఆలోచించిన టీమ్, తాజాగా భూమికను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'లో నాని వదినగా మెప్పించిన భూమిక, ఈ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందన్న మాట. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.    

More Telugu News