chahal: నిన్న చాహల్‌, కుల్‌దీప్‌ బౌలింగ్ ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మైంది: శ్రీలంక ఆట‌గాడు కుశాల్‌ పెరీరా

  • నిన్న భార‌త్‌తో జ‌రిగిన రెండో టీ20లో శ్రీలంక ఓట‌మి
  • భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం
  • కుల్దీప్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయాం
  • మ‌ళ్లీ కోలుకోలేకపోయాం

నిన్న భార‌త్‌తో జ‌రిగిన రెండో టీ20లో శ్రీలంక ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన శ్రీలంక ఆటగాడు కుశాల్‌ పెరీరా భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అన్నాడు. ప్ర‌ధానంగా చాహ‌ల్‌, కుల్దీప్ బౌలింగ్ గురించి వివ‌రించి చెప్పాడు. కుల్దీప్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయామ‌ని తెలిపాడు. అనంత‌రం మ‌ళ్లీ కోలుకోలేకపోయామ‌ని చెప్పాడు. చాహల్ బౌలింగ్‌లోనూ ఇబ్బంది ప‌డ్డామ‌ని తెలిపాడు. తాము మ‌రింత బాగా బ్యాటింగ్ చేస్తే బాగుండేద‌ని తెలిపాడు.

బంతులు వృథా చేయకుండా ఫోర్లు, సిక్సర్ల ద్వారా పరుగులు రాబట్టాలనుకున్నామ‌ని, ఆ క్ర‌మంలోనే భారీ షాట్లు ఆడుతూ వికెట్లు స‌మ‌ర్పించుకున్నామ‌ని కుశాల్‌ పెరీరా చెప్పాడు. భార‌త బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శ‌ర్మ‌, లోకేశ్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడారని కితాబునిచ్చాడు. 

More Telugu News