lalu prasad yadav: జైలుకి వెళుతూ మీడియాపై విసుక్కున్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌!

  • బిర్సా మండా సెంట్ర‌ల్ జైలుకి లాలూ
  • లాలూ స్పందించాల‌ని కోరిన విలేక‌రులు
  • మాట్లాడ‌కుండానే వెళ్లిపోయిన ఆర్జేడీ చీఫ్‌

రెండు దశాబ్దాల సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం దాణా కేసులో ఈ రోజు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన విష‌యం తెలిసిందే. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ సహా ఈ కేసులో 15 మందిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చడంతో వారిని బిర్సా మండా సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జైలు బ‌య‌ట క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. కాగా, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ని సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లించే స‌మ‌యంలో విలేక‌రులు ఆయ‌న స్పందన తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ప‌క్క‌కు జ‌ర‌గండంటూ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వారిపై విసుక్కుంటూ వెళ్లారు. ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా పోలీసు వాహ‌నం ఎక్కి జైలుకి వెళ్లిపోయారు.   

More Telugu News