రాహుల్ గాంధీకి గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా?: ఒవైసీ మండిపాటు
- గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాలను సందర్శించిన రాహుల్
- మళ్లీ ఈ రోజు సోమ్నాథ్ దేవాలయానికి
- మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా?
కాగా, రాహుల్ గాంధీ ఈ రోజు కూడా సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా? వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు? అని అడిగారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.