mumbai: ముంబ‌యి ఎయిర్‌పోర్టులో కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.. ఫొటోలు తీసుకున్న అభిమానులు!

  • ఈ నెల 26న విరుష్క మ‌రో విందు
  • హాజ‌రుకానున్న‌ క్రికెట‌ర్లు, సినీ ప్ర‌ముఖులు
  • ముంబయి చేరుకున్న విరుష్క‌

నిన్న రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్‌లోని దర్బార్ హాల్‌లో క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ, సినీ న‌టి అనుష్క దంప‌తుల వివాహ విందు వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాగా, క్రికెట‌ర్లు, సినీ ప్ర‌ముఖుల‌కు ఈ నెల 26న ముంబయిలో విరుష్క జంట విందు ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో విరుష్క ఇప్ప‌టికే ముంబయి చేరుకుంది. ముంబ‌యి విమానాశ్ర‌యానికి వ‌చ్చిన వారికి అభిమానులు ఘ‌న‌ స్వాగతం పలికారు. ఈ జంట‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డ్డారు. మీరూ చూడండి...




More Telugu News