Narendra Modi: వచ్చే నెల ఏపీకి రానున్న మోదీ?

  • జనవరిలో ఏపీకి మోదీ
  • కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ శంకుస్థాపనకు ఆహ్వానించిన టీడీపీ ఎంపీలు
  • సానుకూలంగా స్పందించిన మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించే అవకాశం ఉందని టీడీపీ అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, కాకినాడ ఎంపీ తోట నర్సింహం తెలిపారు. ఈరోజు వారు ఢిల్లీలో మోదీని కలిశారు. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జ్ ల శంకుస్థాపనకు రావాలని ఈ సందర్భంగా కోరారు. టీడీపీ ఎంపీల విన్నపానికి మోదీ సానుకూలంగా స్పందించారు. అనంతరం తోట, రవీంద్రబాబులు మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత చూపారని చెప్పారు. జనవరిలో ప్రధాని పర్యటన ఖరారవుతుందని అన్నారు. 

More Telugu News