jamuna: మొదటి సినిమా 'పుట్టిల్లు'లో హీరోయిన్ గా అలా ఛాన్స్ వచ్చింది: జమున

  • 'మా భూమి' నాటకంలో నటించాను
  • అప్పుడే గరికపాటి రాజారావు చూశారు
  • 'పుట్టిల్లు' సినిమా సమయంలో ఆయనకి నేను గుర్తుకు వచ్చాను

తెలుగు తెరపై అందానికి .. అభినయానికి అర్థం చెప్పిన అలనాటి కథానాయిక జమున. తాజాగా ఆమె 'అలీతో సరదాగా' కార్యక్రమంలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"పుట్టిల్లు' సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది?" అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. "నా పదేళ్ల వయసులో 'దుగ్గిరాల'లో ప్రజానాట్యమండలి 'మా భూమి'అనే నాటకాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండేది. గరికపాటి రాజారావు ప్రజానాట్య మండలి ఎంటైర్ స్టేట్ ప్రెసిడెంట్. 'మా భూమి' నాటకంలో ఆయన నన్ను చూశారు. 'పుట్టిల్లు' సినిమా తీయాలకున్నప్పుడు జమున అయితే హీరోయిన్ వేషానికి బాగుంటుందని భావించి, రాజమండ్రి పిలిపించి నా చేత రెండు డైలాగులు చెప్పించారు. అలా 1952లో డైరెక్టుగా హీరోయిన్ ను చేసేశారు" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News