raj tarun: హిట్ కాంబినేషన్ మరో ప్రాజెక్టుతో సిద్ధమవుతోంది!

  • 'కుమారి 21 F'తో హిట్ కొట్టిన సూర్య ప్రతాప్ 
  • ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధం 
  • హీరోగా మళ్లీ రాజ్ తరుణ్ 
  • త్వరలో సెట్స్ పైకి    

యువ కథానాయకులలో రాజ్ తరుణ్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన 'కుమారి 21 F' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆ సినిమా హిట్ అయినా ఆయనకి గ్యాప్ రావడానికి కారణం సరైన కథ దొరకకపోవడమేనట.

ఇప్పుడు అలాంటి కథ దొరకడంతో ఆయన రంగంలోకి దిగిపోయాడు. ఈ సారి కూడా రాజ్ తరుణ్ నే హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాను నిర్మించడానికి రామ్ తాళ్లూరి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన రవితేజ - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. రెండవ సినిమాగా రాజ్ తరుణ్ - సూర్య ప్రతాప్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. దిల్ రాజు నిర్మించే 'లవర్' తో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News