murder: కారుకి నిప్పంటించి.. త‌న‌ భార్య‌ల‌ను సజీవ ద‌హ‌నం చేసిన భ‌ర్త‌!

  • రాజస్థాన్‌లో దారుణ‌ ఘ‌ట‌న‌
  • త‌ల్లి విష‌యంలో ఇద్ద‌రు భార్య‌ల‌తో గొడ‌వ‌ప‌డ్డ రామ్ 
  • నిందితుడికి ముగ్గురు పిల్ల‌లు

రాజస్థాన్‌లో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. త‌న ఇద్దరు భార్యలను కారులో ఉంచి త‌గులబెట్టాడు ఓ భ‌ర్త‌. రామ్ అనే వ్య‌క్తికి ఇద్ద‌రు భార్య‌లు ఉన్నారు. బంగారం కొనిస్తానని వారిద్ద‌రినీ కారులో తీసుకెళుతూ తన తల్లి విషయంలో గొడవపడ్డాడు. ఈ క్ర‌మంలో రామ్ ఇద్ద‌రు భార్య‌ల్లో ఒకరు కారు దిగి హెల్ప్.. హెల్ప్ అని అరిచారు. దీంతో ఆమెను కారులోకి తోసి రామ్‌ నిప్పుపెట్టాడు. కారులోనే అత‌డి ఇద్ద‌రు భార్య‌లు సజీవదహనమయ్యారు. రామ్‌ గుజరాత్ వాసిగా తెలిసింది. అత‌డికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేరానికి పాల్ప‌డిన అనంత‌రం అత‌డు పోలీసుల‌కు లొంగిపోయాడు. 

More Telugu News