varun tej: ఫస్టు ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం .. మనసును తాకుతోన్న 'తొలిప్రేమ' టీజర్

  • వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ'
  • కథానాయికగా రాశిఖన్నా 
  • యూత్ కి కనెక్ట్ అవుతోన్న టీజర్ 
  • ఫిబ్రవరి 9వ తేదీన సినిమా రిలీజ్  

వరుణ్ తేజ్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' సినిమా రూపొందుతోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. "మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా, మనం ఫస్టు ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం" అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది.

చలిలో .. చీకటిలో .. సముద్ర తీరంలో వరుణ్ తేజ్ నడుస్తూ కనిపిస్తున్నాడు. మనసంతా ప్రేమతో పాటు ఆవేదనతో నిండినట్టుగా ఆయన కళ్లు చెబుతున్నాయి. టైటిల్ కి తగినట్టుగానే టీజర్ లో ఫీల్ వర్కౌట్ అయింది. యూత్ కి ఈ టీజర్ కనెక్టు అవుతుందని చెప్పొచ్చు. వ్యూవర్స్ మనసుకి ఈ టీజర్ ను జోడించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు.

More Telugu News