busses fire: హైదరాబాదులో రెండు ఆర్టీసీ బస్సులను పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

  • ఉప్పల్ చెరువుకట్ట సమీపంలో ఘటన
  • పూర్తిగా కాలిపోయిన బస్సుల ముందు భాగాలు  
  • దుండగులను గుర్తించే పనిలో పోలీసులు

హైదరాబాదులోని ఉప్పల్ చెరువుకట్ట సమీపంలో పార్క్ చేసిన రెండు ఆర్టీసీ బస్సులను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. పెట్రోల్ పోసి, నిప్పంటించిన ఆనవాళ్లు కనపబడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో బస్సుల ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.

  • Loading...

More Telugu News