thanikella bharani: ఈ ద‌శాబ్ద‌పు అద్భుతం ఇది: ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భల్లో త‌నికెళ్ల భ‌ర‌ణి

  • ర‌వీంద్ర భార‌తిలో ఐదో రోజు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో పాల్గొన్న త‌నికెళ్ల భ‌ర‌ణి
  • ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జరుగుతోన్న తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు
  • తెలుగు మ‌హాస‌భ‌లు అంద‌రిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయి
  • విదేశాల్లో తెలుగు వారు స్ప‌ష్టంగా తెలుగు భాషను మాట్లాడుతున్నారు

తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తోన్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఈ ద‌శాబ్ద‌పు అద్భుతం అని సినీన‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి అన్నారు. హైదరాబాద్‌లోని ర‌వీంద్ర భార‌తిలో ఐదో రోజు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు కొన‌సాగుతున్నాయి. యశోదారెడ్డి ప్రాంగ‌ణంలో విదేశీ తెలుగు వారితో చ‌ర్చాగోష్ఠి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ... ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రుగుతోన్న తీరును కొనియాడారు.

విదేశాల్లో తెలుగు వారు స్ప‌ష్టంగా తెలుగు భాషను మాట్లాడుతున్నార‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి తెలిపారు. తెలుగు మ‌హాస‌భ‌లకి వారు రావ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పారు. తెలుగు మ‌హాస‌భ‌లు అంద‌రిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయని తెలిపారు. కాగా, హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నేటితో ముగుస్తున్నాయి.  

More Telugu News