Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'అజ్ఞాతవాసి' కొత్త స్టిల్స్ విడుద‌ల‌!

  • రేపు హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ఆడియో విడుద‌ల‌
  • అజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్
  • వారితో తీసిన రొమాంటిక్ సీన్ల‌కు సంబంధించిన స్టిల్స్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వస్తోన్న అజ్ఞాత‌వాసి సినిమా ఆడియో విడుద‌ల పండుగ రేపు జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను ఆ చిత్రం బృందం ఈ రోజు విడుద‌ల చేసింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆ ఇద్ద‌రు భామ‌ల‌తో ప‌వ‌న్‌పై తీసిన‌ రొమాంటిక్ సీన్లకు సంబంధించిన స్టిల్స్ ను విడుద‌ల చేసింది. ఒక హీరోయిన్‌తో సాగ‌ర తీరాన‌, మ‌రో హీరోయిన్‌తో ఓ హోట‌ల్‌లోను భోజ‌నం చేస్తూ ప‌వ‌న్ క‌న‌ప‌డుతున్నాడు.

    రేపు హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో ఈ ఆడియో వేదిక‌ నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టికే అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన రెండు పాటలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ కూడా ముఖ్య పాత్రలో క‌న‌ప‌డ‌నున్నారు.  
         

More Telugu News