amith shaw: 2019లోనూ మాదే విజ‌యం: అమిత్ షా

  • గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
  • ఆ రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు
  • ఇది బీజేపీ కార్య‌క‌ర్త‌ల విజ‌యం
  • క‌ర్ణాట‌క స‌హా 4 రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లోనూ బీజేపీదే గెలుపు 

మోదీ నాయ‌క‌త్వంలో 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు సాధించి, గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ... ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఆ రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇది బీజేపీ కార్య‌క‌ర్త‌ల విజ‌యమ‌ని వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో క‌ర్ణాట‌క స‌హా 4 రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లోనూ బీజేపీ గెలుపు సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.  

More Telugu News