xiaomi: ఎరుపు రంగులో ఎమ్ఐఏ1 స్మార్ట్‌ఫోన్‌... భారత్‌లో విడుద‌ల చేసిన షియోమీ

  • డిసెంబ‌ర్ 20న‌ ప్రత్యేక సేల్
  • ఫ్లిప్‌కార్ట్‌, ఎమ్ఐ.కామ్‌ల్లో అమ్మ‌కాలు
  • ధ‌ర రూ. 12,999

భార‌త మార్కెట్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఎమ్ఐఏ1 స్మార్ట్‌ఫోన్‌ను ఎరుపు రంగు వేరియెంట్‌లో ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు చైనా మొబైల్ త‌యారీ సంస్థ షియోమీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌లుపు, బంగారు, రోజ్ గోల్డ్ రంగుల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఎమ్ఐఏ1 స్మార్ట్‌ఫోన్‌ను భార‌త ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే ఫీచ‌ర్స్‌తో కేవ‌లం రంగులో మార్పుతో మాత్ర‌మే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ ప్ర‌వేశ‌పెడుతోంది.

డిసెంబ‌ర్ 20న ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జ‌ర‌గ‌నుంది. రూ. 12,999 ధ‌ర గ‌ల‌ ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ రెడ్ వేరియంట్‌ను ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌, ఎమ్ఐ.కామ్‌ల్లో అమ్మకానికి పెట్ట‌నున్నారు. ఆఫ్‌లైన్‌లో ఎమ్ఐ హోం స్టోర్ల‌లో, పార్ట్‌న‌ర్ స్టోర్ల‌లో కూడా ల‌భించ‌నుంది. గూగుల్ వారి ఆండ్రాయిడ్ వ‌న్ ఆప‌రేటింగ్ సిస్టంతో వ‌చ్చిన ఈ ఫోన్ నాణ్యత ప‌రంగా మంచి పేరు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News