prapancha telugu maha sabhalu: నేడు ప్రపంచ తెలుగు మహాసభల్లో మెరవనున్న టాలీవుడ్ ప్రముఖులు!

  • సాయంత్రం సినీ సంగీత విభావరి
  • ఎల్బీ స్టేడియంలో వేడుక
  • హాజరుకానున్న నాగార్జున, బ్రహ్మానందం తదితరులు

హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన తెలుగువారితో, సాహితీ ప్రముఖులతో, అవధానులతో ఈ వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు.

నాగార్జున, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వరరావు, 'మా' అధ్యక్షుడు శివాజీరాజాలతో పాలు పలువురు హాజరవుతున్నారు. కార్యక్రమంలో వీరంతా ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కదంబ కార్యక్రమం జరగబోతోంది.  

More Telugu News