Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • పోలీస్ అధికారిణిగా రాయ్ లక్ష్మి 
  • 'సాహో' ఫారిన్ షెడ్యూల్ వాయిదా 
  • అంధుడి పాత్రలో మరో యంగ్ హీరో 
  • దుబాయ్ లో బెల్లంకొండ 'సాక్ష్యం'

*  గ్లామరస్ తారగా పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మి తాజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. కర్రి బాలాజీ దర్శకత్వంలో రాజ్ కుమార్ నిర్మించే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇలా పోలీస్ అధికారిగా కనిపిస్తుంది. ఇందులో మరో హీరోయిన్ గా అంజలి నటిస్తోంది.  
*  దుబాయ్, అబుదాబి లలో ప్రారంభం కావలసిన 'సాహో' భారీ షెడ్యూలు వాయిదా పడింది. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా ఈ షెడ్యూల్ ను వాయిదా వేసుకుని, తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులో ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు.    
*  రవితేజ, రాజ్ తరుణ్ తర్వాత యువ హీరో ఆది పినిశెట్టి కూడా అంధుడి పాత్రలో నటించనున్నాడు. హరి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించే చిత్రంలో ఆది ఇలా అంధుడిగా కనిపిస్తాడని సమాచారం. ఈ నెల 21న షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా నటిస్తుంది.
*  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'సాక్ష్యం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. హీరో ఇంట్రడక్షన్ సాంగుతో పాటు, కొన్ని యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

More Telugu News