Swathi: జైల్లో మహిళా ఖైదీలకు అక్షరాలు నేర్పిస్తున్న స్వాతి... నంబర్ 687!

  • ఆందోళన లేకుండా జైలులో కాలం గడుపుతున్న స్వాతి
  • ఉదయాన్నే యోగా, ఆపై ఖైదీలకు చదువు
  • నంబర్ 687ను కేటాయించిన అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితురాలైన స్వాతి, జైలులో ఏ మాత్రం ఆందోళన లేకుండా కాలం గడుపుతున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఆమెకు జైలు అధికారులు 687 నంబరును కేటాయించారు. మొత్తం 13 మంది ఖైదీలు ఉన్న గదిలో ఆమెను కూడా ఉంచారు. కస్టడీ అనంతరం రిమాండ్ నిమిత్తం ఆమెను జైలుకు తరలించగా, తొలి రోజు ఉదయం ఆమె కాసేపు యోగా చేసిందని, ఆపై నిరక్షరాస్యులైన మహిళా ఖైదీలకు అక్షరాలు నేర్పిస్తూ, పాఠాలు చెప్పిందని అధికారులు తెలిపారు.

More Telugu News