vijay: ఆచూకీలేని విజ‌య్ సాయి భార్య వ‌నితా రెడ్డి.. గాలింపు చర్యలు ముమ్మరం!

  • మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులు
  • ఆత్మ‌హత్యకు ప్రేరేపించినట్లు ఆరోప‌ణ‌లు
  • ప‌రారీలో ఉన్న‌ట్లు అనుమానం

క‌మెడియన్‌ విజయ్‌సాయిని ఆత్మహత్యకు ప్రేరేపించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న భార్య వ‌నితా రెడ్డి ఆచూకీ ల‌భించ‌డం లేదు. గ‌త మూడు రోజులుగా జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలిస్తున్న‌ప్ప‌టికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో ఆమె ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె నివాసంతో పాటు మరికొన్ని చోట్ల పోలీసులు నిఘా ఉంచారు.

అయితే విజ‌య్ ఆత్మహత్యకు ముందు ఫోన్‌లో వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఆమెపై అనుమానాల‌కు తావిస్తోంది. ప‌గ‌తీర్చుకుంటాన‌ని బెదిరించ‌డం, అంతుచూస్తాన‌న‌డం వంటి మాట‌లు విజ‌య్‌ని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించేలా ఉన్నాయి. అలాగే విజ‌య్ సెల్ఫీ వీడియో సాక్ష్యం ఆధారంగా పోలీసులు ఆమెను నిందితురాలిగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు య‌త్నిస్తున్నా... ఆమె అందుబాటులో లేక‌పోవ‌డంతో కుటుంబీకుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. వ‌నిత సూర్యాపేట‌లో ఉంద‌ని ఆమె త‌ల్లి చెప్పిన స‌మాధానం, వనిత ఫోన్ సిగ్న‌ల్స్ రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉండ‌టం స‌రిపోల‌క‌పోవ‌డంతో గాలింపు చ‌ర్య‌ల‌ను పోలీసులు మ‌రింత ముమ్మరం చేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News