Venkaiah Naidu: అందుకే నేను నెల‌కి ఒక్క‌సారైనా తెలుగు రాష్ట్రాల‌కు వ‌స్తుంటాను: వెంక‌య్య నాయుడు

  • ప‌ద‌విని స్వీక‌రించిన త‌రువాత కూడా తెలుగు వారికి దూరం కాలేదు
  • తెలంగాణ‌లో, ఆంధ్రలో అడుగుపెట్ట‌క‌పోతే  నాకు ఏదో కోల్పోయిన‌ట్లు ఉంటుంది
  • ఈ మాట‌ను నిర్మొహ‌మాటంగా, నిస్సంకోచంగా చెబుతున్నాను 

తాను ఢిల్లీలో తెలుగువారిని ఒక్క‌చోట చేర్చి వారితో మాట్లాడుతుంటాన‌ని, ఆ ఆనందం అనిర్వ‌చ‌నీయ‌మ‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జ‌రుగుతోన్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లో వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ... ఏదో ఒక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తాను తెలుగు వారిని క‌లుస్తూ ఉంటాన‌ని చెప్పారు. తెలుగువారి సంగీత‌, సాహిత్య కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉంటాన‌ని తెలిపారు.

'ఉప రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌విని స్వీక‌రించిన త‌రువాత కూడా నేను తెలుగు వారికి దూరం కాలేదు. ఎందుకో నెల‌కొక్క‌సారైనా నేను పెరిగిన తెలంగాణ‌లో, నేను పుట్టిన ఆంధ్రలో అడుగుపెట్ట‌క‌పోతే తెలుగు నేల‌ను తాక‌క‌పోతే నాకు ఏదో కోల్పోయిన‌ట్లు ఉంటుంద‌ని నేను నిర్మొహ‌మాటంగా, నిస్సంకోచంగా చెబుతున్నా' అని వెంక‌య్య నాయుడు అన్నారు.  
   

More Telugu News