lambadi: లంబాడీలు, ఆదివాసుల ఘర్షణ.. హ‌స్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు!

  • లంబాడీలు, ఆదివాసుల మ‌ధ్య గొడ‌వ‌
  • కొన్ని షాపుల‌కు నిప్పు అంటించిన‌ ఆందోళ‌న‌కారులు
  • ఇరువ‌ర్గాల దాడిలో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం
  • బాష్ప‌వాయువు ప్ర‌యోగించిన పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండ‌లం హ‌స్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. లంబాడీలు, ఆదివాసుల మ‌ధ్య త‌లెత్తిన గొడ‌వలో విధ్వంసం చోటు చేసుకుంది. కొన్ని షాపుల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్టారు. ఇరువ‌ర్గాల దాడిలో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఓ మ‌ద్యం దుకాణానికి నిప్పు అంటుకుంది.

లంబాడీలు, ఆదివాసుల మ‌ధ్య‌ రాళ్ల‌దాడి కూడా జ‌రిగింది. చేతుల్లో క‌ర్ర‌లు ప‌ట్టుకుని వారు ఆందోళ‌న‌కు దిగ‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం చెల‌రేగింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు ఆందోళ‌నకారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు బాష్ప‌వాయువును ప్ర‌యోగించారు. ఘ‌ట‌నా స్థ‌లికి ఎస్పీ శ్రీనివాస్ చేరుకున్నారు.   

  • Loading...

More Telugu News