minister chandulal: తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడి వాహనంపై రాళ్లదాడి!

  • రసాభాసగా మారిన మేడారం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకార కార్యక్రమం
  • లంబాడీలను అడ్డుకున్న ఆదివాసీలు
  • ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు స్థానం కల్పించడంపై ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఆదివాసీలు ఈ దాడికి పాల్పడ్డారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన లంబాడీలను ఆదివాసీలు అడ్డుకున్నారు. 'లంబాడీలు గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు.

 మేడారం ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు ఎలా స్థానం కల్పిస్తారని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రహ్లాద్ ను కూడా అడ్డుకున్నారు. అంతేకాదు, ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మేడారంలో ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. 

More Telugu News