Cricket: రెండో వ‌న్డే: అర్ధ‌ సెంచ‌రీ చేసిన మాథ్యూస్‌

  •  ప్ర‌స్తుతం శ్రీలంక స్కోరు 177/6 (33 ఓవ‌ర్ల‌కి)
  •  చాహెల్ కి 3 వికెట్లు
  •  పాండ్యా, బుమ్రా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ల‌కు చెరో వికెట్

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో జ‌రుగుతోన్న భార‌త్, శ్రీలంక వ‌న్డే మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు రాణిస్తున్నారు. శ్రీలంక‌ ఆరు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణ‌తిల‌క 16, త‌రంగ 7, తిరిమ‌న్నే 21, డిక్ వెల్లా 22 , అసెలా గుణ‌ర‌త్నే 34, పెరెరా 5 ప‌రుగులు చేసి వెనుదిరిగారు. ప్ర‌స్తుతం క్రీజులో స‌చిత్ ప‌తిరానా 1 పరుగుతో ఉన్నాడు. మాథ్యూస్ ధాటిగా ఆడుతూ 62 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో చాహెల్ 3 వికెట్లు తీయ‌గా, పాండ్యా, బుమ్రా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ల‌కు చెరో వికెట్ ల‌భించాయి. ప్ర‌స్తుతం శ్రీలంక స్కోరు 177/6 (33 ఓవ‌ర్ల‌కి) గా ఉంది.
 

More Telugu News