manjula: నాని హీరోగా మంజుల నిర్మించే సినిమా!

  • ప్ర‌స్తుతం మ‌న‌సుకు న‌చ్చింది సినిమాకి మంజుల ద‌ర్శ‌క‌త్వం
  • నెక్స్ట్ నాని సినిమాకి నిర్మాత‌
  • నాని కొత్త‌ సినిమానికి ద‌ర్శ‌కుడిగా విక్రమ్ కె కుమార్

సూపర్ స్టార్ కృష్ణ త‌న‌య మంజుల ప్ర‌స్తుతం 'మ‌న‌సుకు న‌చ్చింది' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప‌నుల్లో బిజీబిజీగా ఉండగానే ఆమె మరో సినిమాను కూడా మొదలుపెట్టనున్నారు. ఆ సినిమాకు మంజుల నిర్మాతగా వ్యవహరించనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నాని న‌టించ‌నుండ‌గా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం నాని న‌టించిన ‘ఎమ్‌సీఏ’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే.

More Telugu News