flipkart: ఫ్లిప్‌కార్ట్ 'న్యూ పించ్ డేస్' సేల్‌... మొబైల్స్ ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన సంస్థ‌!

  • ఎమ్ఐ మిక్స్‌2 ధ‌రపై రూ. 5000 త‌గ్గింపు
  • మోటో జెడ్‌2 ప్లే ధ‌ర రూ. 24,999
  • డిసెంబ‌ర్ 15న ప్రారంభం కానున్న సేల్‌

వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సేల్స్‌ను ప్ర‌క‌టించే ఆన్‌లైన్ అమ్మ‌కాల‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'న్యూ పించ్ డేస్' పేరుతో మ‌రో సేల్‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సేల్‌లో మొబైల్స్ మీద భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 15 నుంచి ఈ సేల్ ప్రారంభ‌కాబోతున్న నేప‌థ్యంలో మొబైల్స్ మీద‌ ఆఫ‌ర్ల జాబితాను ఫ్లిప్‌కార్ట్ ఇవాళ వెల్ల‌డించింది.

ఈ ఆఫ‌ర్ల‌లో హీరో ఆఫ్ ది ఇయ‌ర్‌గా శాంసంగ్ ఆన్‌ నెక్స్ట్  (64జీబీ) మీద ఇచ్చిన ఆఫ‌ర్‌ను పేర్కొంది. సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ను రూ. 10,900 నుంచి రూ. 16,900 మ‌ధ్య అమ్మ‌నుంది. క‌చ్చిత ధ‌ర‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇంకా ఇత‌ర ఆఫ‌ర్ల‌లో ఎమ్ఐ మిక్స్ 2పై రూ. 5000 త‌గ్గింపు ప్ర‌క‌టించింది. రూ. 37,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 32,999కి అంద‌జేయ‌నుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో మొబైల్‌ను రూ. 5,999కి, ఎల్‌జీ క్యూ 6(3 జీబీ)ని రూ. 12,990కి, శాంసంగ్ గెలాక్సీ జే3 ప్రో (2 జీబీ)ని రూ. 6,990కి అంద‌జేయ‌నుంది. ఇంకా గెలాక్సీ ఆన్‌5, గెలాక్సీ ఆన్ మ్యాక్స్‌, లెనెవో కే8 ప్ల‌స్‌, ఒప్పో ఎఫ్‌3 ప్ల‌స్‌, ఆన‌ర్ 9ఐ, మోటో ఎక్స్‌4, మోటో జెడ్‌2 ప్లే, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7, ఎల్‌జీ జీ6, హెచ్‌టీసీ యూ11, ఎల్‌జీ వీ20 స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌ల‌ను కూడా ప్లిప్‌కార్ట్ త‌గ్గించింది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై డిస్కౌంట్‌, ఇత‌ర ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్లు కూడా ఉన్న‌ట్లు పేర్కొంది.

More Telugu News